మోడీకి భారత్ బలమేంటో తెలియదు | Narendra Modi doesn't understand India, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మోడీకి భారత్ బలమేంటో తెలియదు

May 10 2014 5:14 PM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీకి భారత్ బలమేంటో తెలియదు - Sakshi

మోడీకి భారత్ బలమేంటో తెలియదు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీకి భారత్ను, ఇక్కడి ప్రజలను అర్థం చేసుకోలేరని రాహుల్ విమర్శించారు.

చాందౌలీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీకి భారత్ను, ఇక్కడి ప్రజలను అర్థం చేసుకోలేరని రాహుల్ విమర్శించారు. ఆయన పార్టీ విద్వేష రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మోడీ పోటీ చేస్తున్న వారణాశిలో రాహుల్ శనివారం రోడ్డు షో నిర్వహించారు.

స్నూప్ గేల్ వివాదాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. మహిళలకు అధికారం ఇస్తామని చెబుతున్న మోడీ.. గుజరాత్లో ఓ మహిళను వేధించి, ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement