మున్సిపల్ కౌంటింగ్‌కు రంగం సిద్ధం | municipal elections counting on 12th | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కౌంటింగ్‌కు రంగం సిద్ధం

May 11 2014 1:56 AM | Updated on Sep 2 2018 4:48 PM

మున్సిపల్ కౌంటింగ్‌కు రంగం సిద్ధం - Sakshi

మున్సిపల్ కౌంటింగ్‌కు రంగం సిద్ధం

మున్సిపాల్టీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవా రం ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, ఆమదలవలస మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: మున్సిపాల్టీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవా రం ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, ఆమదలవలస మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి విదితమే. వాస్తవానికి గత నెలలోనే ఈ ఓట్ల లెక్కిం పు జరగాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగితేగానీ మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మున్సిపాల్టీల ఈవీఎంలను, ప్రాదేశికాల బ్యాలెట్ బాక్సులను ఎచ్చెర్లలోని 21వ శతాబ్ది గురుకులంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు తలమునకలయ్యారు.
 
 పాలకొం డ, ఆమదాలవలస మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు గురుకులంలో జరగనుండడం తో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. అలాగే ఇచ్ఛాపురం, పలాసకు సంబంధించిన ఈవీఎంలను సంబంధిత మున్సిపాల్టీలకు శనివారం గట్టి భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో తరలించారు. రాజకీయ పక్షాల ప్రతినిధు ల సమక్షంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో రమేష్, ఇచ్ఛాపురం, పలాస మున్సిపల్ కమిషనర్లు కె.వై.రత్నరాజు, నాగేంద్రకుమార్ సమక్షంలో స్ట్రాంగ్ రూంల సీళ్లు తెరి చారు. అనంతరం ఇచ్ఛాపురం, పలాస ఈవీఎంలను ప్రత్యేక బస్సుల్లో పంపించా రు. రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా వాటి వెంట ఉన్నారు. కాగా పాలకొండ, ఆమదాలవలస మున్సిపాల్టీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు గురుకులంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్ హాల్ ముందు ముళ్ల కంచె, పరిసరాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement