రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర | ys sharmila paramarsha yatra of second phase in warangal district starts tomorrow | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర

Sep 6 2015 4:38 PM | Updated on May 29 2018 6:04 PM

రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర - Sakshi

రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు.

వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు.


సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈనెల 9,10 తేదీల్లో నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నారు. పరామర్శయాత్రలో భాగంగా నర్సంపేటలో వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించనున్నట్లు పార్టీ నేత గోవర్థన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement