యువకుడు ఆత్మహత్య | youger suiciedes in idukallu | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Nov 22 2016 11:20 PM | Updated on Sep 4 2017 8:49 PM

తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

శెట్టూరు : తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మాలేపల్లికి చెందిన అనంతమ్మ, చండ్రాయుడు ఐదుకల్లులో ఓ వ్యవసాయ తోటలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అనిల్‌(17) చివరి వాడు.ఇంటర్‌ వరకు చదువుకున్నాడు.

ఏ పని చేయకుండా మిన్నకుండేవాడన్నారు. కళాశాలకు వెళ్లి చదువుకోవాలని పలుమార్లు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఎలా సంపాదిస్తావని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ ఐదుకల్లులోని ఓ వ్యవసాయ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శెట్టూరు ఎస్‌ఐ శ్రీకాంత్, ఏఎస్‌ఐ కుళ్లాయప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement