మద్దికెర మండలం పెరవలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
మద్దికెర(కర్నూలు జిల్లా): మద్దికెర మండలం పెరవలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఎరుకల దుర్గమ్మ(45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.