
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్తతో సహా అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కిరోసిన్ పోసుకుని ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమెను రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.