కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య | Woman sucide with stomach Pain | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

Aug 26 2016 10:35 PM | Updated on Sep 4 2017 11:01 AM

మిడ్జిల్‌ : కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అలివేల (30) కు సుమారు పదేళ్ల క్రితం మిడ్జిల్‌ మండలంలోని మున్ననూర్‌ వాసి లక్ష్మయ్యతో వివాహమైంది.

మిడ్జిల్‌ : కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అలివేల (30) కు సుమారు పదేళ్ల క్రితం మిడ్జిల్‌ మండలంలోని మున్ననూర్‌ వాసి లక్ష్మయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, కొన్నాళ్లుగా భార్య తరచూ కడుపునొప్పితో బాధపడుతుండగా వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం సాయంత్రం ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రమేష్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement