కుళాయి దగ్గర గొడవ.. యువతి ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

కుళాయి దగ్గర గొడవ.. యువతి ఆత్మహత్య

Jun 11 2016 4:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది.

వర్ని (నిజామాబాద్) : నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నీళ్లు ఎవరు ముందు పట్టుకోవాలన్న విషయమై గంగామణి(20) అనే యువతికి, ఇతర మహిళలకు మధ్య మాటల యుద్ధం జరిగింది.

అసభ్య పదజాలం ప్రయోగించడంతో ఆ మాటలకు మనస్తాపం చెందిన గంగామణి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా గంగామణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement