సత్తాచాటిన పశ్చిమ | west is winner | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన పశ్చిమ

Nov 12 2016 2:23 AM | Updated on Sep 4 2017 7:50 PM

నారాయణపురం (ఉంగుటూరు) : సపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. బాలుర జట్టు విజేతగా నిలిచింది. నారాయణపురం బాపిరాజు స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న అండర్‌–19 సపక్‌ తక్రా బాల, బాలికల టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది

నారాయణపురం (ఉంగుటూరు) : సపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. బాలుర జట్టు విజేతగా నిలిచింది. నారాయణపురం బాపిరాజు స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న అండర్‌–19 సపక్‌ తక్రా బాల, బాలికల టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన తుది పోటీల్లో కర్నూలు జట్టు ద్వితీయ స్థానం దక్కించుకోగా కడప జట్టు తృతీయస్థానం పొందింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు ఛాంపియ¯ŒSగా నిలిచింది. శ్రీకాకుళం దిృతీయ, పశ్చిమ గోదావరి తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ వి.సోమశేఖర్‌ అధ్యక్షత వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ తిరుపణ్యం, సపక్‌తక్రా రాష్ట్ర పరిశీలకుడు ఎ. సుబ్బరాజు, ఈ పోటీల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అద్దంకి ఐజాక్, జిల్లా ఒలింపిక్స్‌  అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, జీఎంఎస్‌ కుమార్, రాజా, మూర్తి, శ్రీను, పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement