కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత | villagers stopped Cattle to Kabela in ranga reddy district | Sakshi
Sakshi News home page

కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

Nov 13 2015 7:53 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేలాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ఘట్‌కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా  ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement