బీబీనగర్ మండలం నాగారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.
బీబీనగర్ మండలం నాగారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ వైరు తగిలి ముగ్గురు వ్యక్తులు కరెంటు షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో సందెల కుమార్(30), ఎం.అనిల్(20) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ప్రశాంత్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రశాంత్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.