కరెంటు షాక్ తగిలి ఇద్దరి మృతి | Two were killed with an electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్ తగిలి ఇద్దరి మృతి

Jul 6 2016 8:09 PM | Updated on Apr 8 2019 7:51 PM

బీబీనగర్ మండలం నాగారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

బీబీనగర్ మండలం నాగారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ వైరు తగిలి ముగ్గురు వ్యక్తులు కరెంటు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో సందెల కుమార్(30), ఎం.అనిల్(20) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ప్రశాంత్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రశాంత్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement