అనంతపురం ఎడ్యుకేషన్ : టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) లోయర్ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీటీసీ లోయర్ థియరీ పరీక్షా ఫలితాల విడుదల
Published Tue, Oct 25 2016 10:07 PM
Related news
-
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన పేపర్లకు మార్కులు వేసే సీబీఎస్ఈ నాలుగు అంశాల ఫార్ములాకు కూడా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున జూలై 1నుంచి 15వ తేదీల మధ్యన జరగాల్సిన సీబీఎస్ఈ పెండింగ్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజయ్ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సీబీఎస్ఈ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున 10, 12వ తరగతి పెండింగ్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ నిర్ణయించాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బోర్డు పరీక్షలు నిర్వహించలేమంటూ అశక్తత వ్యక్తం చేశాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. 10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మిగిలి ఉన్న పరీక్షలకు హాజరు కావడమా లేక ఇప్పటికే హాజరైన పరీక్షల్లో చూపిన ప్రతిభను బట్టి వేసే మార్కులకు అంగీకరించడమా అనే ఆప్షన్ను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామన్నారు. సీబీఎస్ఈ విధానాన్నే అటూఇటుగా తామూ అనుసరిస్తామని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ధర్మాసనానికి నివేదించింది. 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీకల్లా ప్రకటిస్తామని ఐసీఎస్ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు గత పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని ఐసీఎస్ఈ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సీబీఎస్ఈ పరీక్షలు అర్థంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యుత్తమ సరాసరి మార్కులే ఆధారం 10, 12వ తరగతి విద్యార్థి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన వారికి, మూడు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికైతే రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి మార్కులు వేస్తాయనుంది. ఢిల్లీలో అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు. -
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ 2019 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్ కన్వీనర్ ప్రొ.మృణాళిని, ప్రొ. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం 43,113 మంది పరీక్షకు హాజరు కాగా 41,195 క్వాలిపై అయినట్లు తెలిపారు. జూలై లాస్ట్ వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
ఐసెట్లో 90 శాతం మంది అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాల ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 61,439 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 55,191 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 49,812 మంది (90.25 శాతం) అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో నిర్వహించే సెట్ కమిటీ సమావేశంలో.. ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తామని వివరించారు. గతేడాది 304 ఎంబీఏ కాలేజీల్లో 32 వేల సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 5,846 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి యూనివర్సిటీలు ఇచ్చే గుర్తింపును బట్టి సీట్ల సంఖ్య తేలుతుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు: పాపిరెడ్డి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కాలేజీపై ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని, వాటికి ఆధారాలు ఉండాలని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నిబంధనలు జారీ చేశామని, వాటి ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థులు కూడా.. ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు బీకాం విద్యార్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. తర్వాతి స్థానంలో బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హత సాధించిన వారిలోనూ బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు.
Related News by category
-
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
బాలికలు.. భళా
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థిని తన్నేరు ప్రణతి ● 76 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలను గాను 12,766 మంది 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టాప్లో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు టాప్లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24వ స్థానంలో జిల్లా జిల్లాలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగుస్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30లోగా ఫీజు చెల్లింపు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ. 125, మూడు లోపు సబ్జెక్టులకు రూ. 110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు. -
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. -
మండుటెండలోనూ పోటెత్తారు..
ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement