మహబూబ్నగర్ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్మ పరిచయం,ధర్మ ప్రవేశిక 33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నేడు ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సహాయకులు ఉత్తరాపల్లి రామాచారి మంగళవారం తెలిపారు.
నేడు విద్యార్థులకు బహుమతుల ప్రదానం
Aug 31 2016 12:01 AM | Updated on Sep 4 2017 11:35 AM
మహబూబ్నగర్ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్మ పరిచయం,ధర్మ ప్రవేశిక 33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నేడు ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సహాయకులు ఉత్తరాపల్లి రామాచారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధర్మ పరిచయంలో కె.రమాదేవి ( పాల్వాయి హైస్కూల్),కె.శ్వేత (టీడీ గుట్ట హైస్కూల్),కె.నరేశ్(ఉప్పునుంతల హైస్కూల్) విద్యారులు ప్రథమ,ద్వితీయ,తతీయ బహుమతులకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.ధర్మ ప్రవేశికలో ఎ.రూపిక, బి.గోపాల్ నాయక్ ( కల్వకుర్తి సీవీ రామన్ హైస్కూల్), ఎస్.స్రవంతి (ఎదిర హైస్కూల్) విద్యార్థులు ప్రథమ,ద్వితీయ,తతీయ బహుమతులకు ఎంపికయ్యారని తెలిపారు.
Advertisement
Advertisement