అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పరిధి యాదగిరిపల్లి శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
యాదగిరిగుట్ట
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పరిధి యాదగిరిపల్లి శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ ంలోని బీసీ కాలనికి చెందిన జగనాథం చిన్న వెంకటయ్య(29) వెంట్రుకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటయ్య ఆదివారం ఉదయం 11గంటలకు పిట్టల షికారికని వెళ్లాడు. సాయంత్రమైన తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య, కాలనీలో వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో భార్య బంధువులతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం భార్య, తమ బంధువులతో కలిసి వెతికింది. తరచు షికారికి వెళ్లే యాదగిరిపల్లి శివారులోని ఓ వెంచర్ సమీపంలోకి వెళ్లి చూసింది. అక్కడ ఉన్న ఓ చెట్టు కింద తన భర్త వెంకటయ్య మరణించి కనిపించాడు. దీంతో బంధువులు ఎస్ఐ రాజశేఖర్రెడ్డికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.