పెన్నాలో పడి వృద్ధుడి మృతి | The Elder died in penna river | Sakshi
Sakshi News home page

పెన్నాలో పడి వృద్ధుడి మృతి

Sep 9 2016 10:00 PM | Updated on Sep 4 2017 12:49 PM

గుర్రంపాడు పంచాయతీకి చెందిన వీరబోయిన వెంకటసుబ్బయ్య(80) పెన్నా నదిలో పడి మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు.

నజీర్‌భేగ్‌పల్లె(చెన్నూరు) : గుర్రంపాడు పంచాయతీకి చెందిన వీరబోయిన వెంకటసుబ్బయ్య(80) పెన్నా నదిలో పడి మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆ వృద్ధుడికి మతి స్థిమితం లేదని, 10 రోజులుగా కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. శనివారం నజీర్‌భేగ్‌పల్లె దళితవాడ ప్రజలు పెన్నా సమీపంలోకి వెళ్లగా.. నదిలోని కంప చెట్ల మధ్యన మృతదేహం ఉండటంతో బయటకు తీసుకొచ్చి ఖననం చేశారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement