అనంతపురం జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది (పీపీ)గా లేపాక్షినాయుడు బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. బెళుగుప్ప మండలానికి చెందిన లేపాక్షి నాయుడు 1993 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2002 నుంచి 2006 వరకు నాలుగో జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు.
అనంతపురం లీగల్: అనంతపురం జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది (పీపీ)గా లేపాక్షినాయుడు బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. బెళుగుప్ప మండలానికి చెందిన లేపాక్షి నాయుడు 1993 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2002 నుంచి 2006 వరకు నాలుగో జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించిన లేపాక్షినాయుడును పలువురు న్యాయవాదులు అభినందించారు.