‘కస్తూర్బా’కు చలిజ్వరం | students suffering with fever | Sakshi
Sakshi News home page

‘కస్తూర్బా’కు చలిజ్వరం

Aug 15 2016 9:33 PM | Updated on Jun 13 2018 8:02 PM

విద్యార్థినిని చికిత్స కోసం తీసుకువచ్చిన టీచర్‌ - Sakshi

విద్యార్థినిని చికిత్స కోసం తీసుకువచ్చిన టీచర్‌

తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చలి జ్వరం పట్టుకుంది. ఉన్నట్టుండి విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోతున్నారు.

  • కళ్లు తిరిగి పడిపోతున్న విద్యార్థినులు
  • సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స
  • 8 మందికి పైగా జ్వరాలు
  • మునిపల్లి: తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చలి జ్వరం పట్టుకుంది. ఉన్నట్టుండి విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. కొందరైతే శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కృష్ణవేణి అనే విద్యార్థినిని శ్వాసతీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. తాటిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్‌ సంగారెడ్డికి తీసుకెళ్లాలని సూచించారు.

    దీంతో ఆ విద్యార్థినిని హుటాహుటిన సంగారెడ్డికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పాఠశాల ప్రిన్సిపాల్‌ కవిత తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థినులు చలి జ్వరంతో బాధ పడుతున్నారు. వారిని కూడా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా ఒకరి తరువాత ఒకరు కళ్లు తిరిగి పడిపోతుండటంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తున్నట్టు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement