
ముస్లిం రిజర్వేషన్లు పెంచొద్దు
ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన ను టీఆర్ఎస్ ప్రభు త్వం ఉపసంహరిం చుకోవాలని బీజే ఎల్పీ నేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సుధీర్కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, ఎంఐఎం కార్యా లయం దారూస్సలాంలో దాన్ని తయారు చేశారన్నారు. ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావుతో కలసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, 4 రోజుల్లో 312 పేజీల నివేదిక చదివి బీసీ సంఘాలెలా అభ్యంత రాలు తెలపగలరని ప్రశ్నించారు.