ఎర్రకాలువ నుండి ఇసుక రవాణా నిషేధించినా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లపై అధికారులు కేసు నమోదు చేసారు.తహసిల్ధారు పి.పద్మావతి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ.జి.మధుబాబు సోమవారం ఉదయం కవులూరు–పోతవరం మధ్య ఎర్రకాలువ నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 32ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 32 ట్రాక్టర్లు స్వాధీనం
Oct 10 2016 9:13 PM | Updated on Aug 20 2018 7:27 PM
నల్లజర్ల: ఎర్రకాలువ నుండి ఇసుక రవాణా నిషేధించినా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లపై అధికారులు కేసు నమోదు చేసారు.తహసిల్ధారు పి.పద్మావతి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ.జి.మధుబాబు సోమవారం ఉదయం కవులూరు–పోతవరం మధ్య ఎర్రకాలువ నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 32ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు.పోలీస్ స్టేషన్కు 7ట్రాక్టర్లు ఇసుకతో రాగ మిగిలినవి ఇసుకను మార్గమధ్యమంలో ఒంపేసి తీసుకువచ్చారు.సి.ఐ మధుబాబుతో పాటు పోతవరం విఈర్ఓలు ఫణిబాబు,సి.హెచ్.రాంబాబు ఉన్నారు.
Advertisement


