నెల్లూరు(బందావనం) : నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
నేటి నుంచి ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు
Jul 26 2016 6:40 PM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బందావనం) : నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం తిరుమంజనం, సాయంత్రం ప్రాకారోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 5వ తేదీ రాత్రి పేట ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు.
Advertisement
Advertisement