కాలువలో పడి వ్యక్తి గల్లంతు! | person missing in canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి వ్యక్తి గల్లంతు!

Oct 23 2016 1:41 AM | Updated on Sep 4 2017 6:00 PM

తణుకు : తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో 16వ నంబర్‌ జాతీయ రహదారి వంతెన పై నుం చి గోస్తనీ కాలువలోకి గు ర్తుతెలియని వ్యక్తి దూకి ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తణుకు : తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో 16వ నంబర్‌ జాతీయ రహదారి వంతెన పై నుం చి గోస్తనీ కాలువలోకి గు ర్తుతెలియని వ్యక్తి దూకి ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కాలువలో దూకిన వ్యక్తి వివరాలు లభ్యం కాకపోగా వంతెనపై సైకిల్‌తోపాటు చెప్పులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుతోంది. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కాలువలో వ్యక్తి కొట్టుకుని వెళుతున్నట్టు గుర్తించామని  కాలువ సమీపంలో నివాసముంటున్న స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పట్టణ పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement