విజయవాడ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన | passengers agigate to negligence of APSRTC management to provide bus services | Sakshi
Sakshi News home page

విజయవాడ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన

Jul 18 2016 3:12 AM | Updated on Apr 7 2019 3:24 PM

విజయవాడలో పండిత్‌ నెహ్రూ బస్టాండు వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

విజయవాడ: విజయవాడలో పండిత్‌ నెహ్రూ బస్టాండు వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సులో సమస్య తలెత్తడంతో బస్సును అక్కడే నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు ప్రయాణికులు ఎదురుచూసిన ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆక్రోశం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారుల తీరుకు నిరసనగా విజయవాడ బస్టాండు ఎగ్జిట్‌ మెయిన్‌ గేట్‌ వద్ద బైఠాయించారు. బస్టాండులో నుంచి ఏ ఒక్క బస్సును కూడా బయటకు వెళ్లనీయకుండా ప్రయాణికులు అడ్డుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement