టార్గెట్లకు నోటీసులు | notice to maoist targets | Sakshi
Sakshi News home page

టార్గెట్లకు నోటీసులు

Jul 28 2016 12:49 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న టార్గెట్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు.

ఏటూరునాగారం :  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న టార్గెట్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర ్వహిస్తున్న నేపథ్యంలో ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చనే అనుమానంతో ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లోని కాంట్రాక్టర్లు, నకిలీ రుణాల దళారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి వారిని  జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement