అమ్మ భాషకు ఆదరణ కరువు | no support for mother language | Sakshi
Sakshi News home page

అమ్మ భాషకు ఆదరణ కరువు

Sep 18 2016 9:03 PM | Updated on Sep 4 2017 2:01 PM

జంధ్యాల రఘుబాబు దంపతులను సన్మానిస్తున్న దశ్యం

జంధ్యాల రఘుబాబు దంపతులను సన్మానిస్తున్న దశ్యం

ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు ఆదరణ తగ్గుతోందని ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

– ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన
 
 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు ఆదరణ తగ్గుతోందని ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషపై మోజుతో తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకే పంపుతూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నార న్నారు. శ్రీపింగలి సూరన తెలుగుతోటలో ఆదివారం కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘కథ–కవితా వస్తువులు ప్రపంచీకరణ ప్రభావము’ అన్న అంశంపై సాహితీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌ కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మ, ఆర్‌.రామారావు, జే.శివకష్ణ, అర్జున్, సుధీర్, పార్వతీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement