కర్నూలు(ఓల్డ్సిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. సోమవారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ, టీడీపీలు డ్రామా ఆడయాన్నారు. రాజ్యసభ సభ్యుడిగా వేరే రాష్ట్రానికి పోయినంత మాత్రాన మీరు రాష్ట్రవాసి కాకపోరు కదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ప్రశ్నించారు.
టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చినా చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు సిగ్గురాలేదన్నారు. అదిగో..ఇదిగో ప్రత్యేక హోదా అని రెండున్నర ఏళ్లుగా ప్రచారం చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పుడు మాట మార్చితే జనం హర్షించరన్నారు. ఓర్వకల్లు దగ్గర 30 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏడాది క్రితం శిలాఫలకం వేశారని, ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. రాష్ట్రానికి హోదా లేకుంటే ఏ పరిశ్రమ రాదని చెప్పారు. తనకు తానుగా నీతిమంతుడిని నని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నట్లని ప్రశ్నించారు. దీనిపై ఎక్కడ తనను నిలదీస్తారోనని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. బాబు పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారంతా ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రాజా విష్ణువర్దన్రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు యాదవ్, అశోక్, ప్రహ్లాదాచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలం
Published Mon, Sep 12 2016 11:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement