వివాహిత ఆత్మహత్య | Married suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 29 2016 12:43 AM | Updated on Sep 4 2017 6:46 AM

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో గురువారం జరిగింది.

 కె.బిట్రగుంట (సింగరాయకొండ): ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన షేక్‌ సుభానీ బీఎస్‌పీసీఎల్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాగానే భార్య మస్తానమ్మ(25) చీరెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పిల్లలు కలగలేదన్న మానసిక వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని భర్త సుభానీ చెబుతుండగా తమ బిడ్డ ఆత్మహత్యకు సుభానీయే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకోటయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement