నిజామబాద్ పట్టణంలో మహారాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది.
నిజామబాద్: నిజామబాద్ పట్టణంలో మహారాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. దుండగులు ఆయుధాలతో ఎన్ఆర్ఐ కాలనీలో ఇళ్లలోకి చొరబడ్డారు. భయాందోళనలతో ఇళ్లలోని మహిళలు కేకలు వేయటంతో స్థానికులు అప్రమత్తమై దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో ఓ దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దొంగల ముఠాలో ఎనిమిది మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.