కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో ప్రత్యేకాధికారి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షను శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థానిక పాత ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసాచారి తెలిపారు.
29న ప్రత్యేకాధికారి పోస్టులకు రాతపరీక్ష
Jul 27 2016 11:53 PM | Updated on Sep 4 2017 6:35 AM
సప్తగిరికాలనీ: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో ప్రత్యేకాధికారి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షను శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థానిక పాత ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసాచారి తెలిపారు. అభ్యర్థినులు గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు కూడా హాల్టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థినులు ఏదైనా గుర్తింపుకార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోను తప్పక వెంట తెచ్చుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement