నేటి నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు | International Conference in Visakhapatnam | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు

Jan 10 2016 6:30 AM | Updated on Oct 17 2018 5:55 PM

ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశాఖ పట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు.

విశాఖ: ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశాఖ పట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. తొలి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సదస్సును ప్రారంభించనున్నారు. మూడు రోజుల సదస్సులో 2లక్షల కోట్ల  రూపాయల మేర ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తెలిపారు.

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో సహా.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతరామన్ లు కార్యక్రమంలో పాల్గొనున్నారు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తాయని రావత్ అభిప్రాయపడ్డారు. సదస్సు ముగింపు సమావేశంలో గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement