ద్విచక్ర వాహనాలు అపహరించే అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వేణుగోపాల్, పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు.
దొంగలముఠా
Jul 29 2016 12:10 AM | Updated on Aug 20 2018 4:27 PM
– రూ.16.70 లక్షల విలువ చేసే 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ వేణుగోపాల్
ధర్మవరం అర్బన్:
ద్విచక్ర వాహనాలు అపహరించే అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వేణుగోపాల్, పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. గురువారం పట్టణ పోలీస్స్టేçÙన్లో అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చూపారు. డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.16.70 లక్షల విలువ చేసే 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం ముక్కమళ్లకు చెందిన మల్లు వెంకటేశ్వరరెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓబులేసు, కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయపల్లికు చెందిన నాగేష్నాయక్, అవుకు మండలం చెర్లోపల్లికి చెందిన కంబయ్యలు స్నేహితులు. వీరికున్న దుర లవాట్లతో ద్విచక్రవాహనాల దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ధర్మవరం, అనంతపురం, కసాపురం, తాడిపత్రి, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం ధర్మవరం పట్టణ సమీపంలోని మార్కెట్ యార్డు వద్ద పట్టణ సీఐ హరినాథ్, స్టేషన్ సిబ్బంది హెడ్కానిస్టేబుళ్లు మునేనాయక్, శ్రీధర్ఫణి, కానిస్టేబుళ్లు అల్లీపీర, నాగరాజు, ప్రసాద్, భాస్కర్నాయుడు, వెంకటేష్ నిందితులను అరెస్ట్ చేశారు. వీరి ఇళ్ల నుంచి మొత్తం 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పట్టణ సీఐ హరినాథ్, సిబ్బందిని డీఎస్పీ వేణుగోపాల్ అభినందించారు.
Advertisement
Advertisement