మండలంలోని పెద్దకొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటంబావికి చెందిన పడమటి అశోక్రెడ్డి(37) ఆదివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చౌటుప్పల్ : మండలంలోని పెద్దకొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటంబావికి చెందిన పడమటి అశోక్రెడ్డి(37) ఆదివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కొంత కాలంగా అప్పుల బాధతో, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఉదయం 7గంటల సమయంలో తన వ్యవసాయ బావి వద్ద గల కోళ్లఫామ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి భార్య గేదెలను తోలుకొని, బావి వద్దకు రాగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్కుమార్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉంది. కాగా మృతుడు అశోక్రెడ్డి నాలుగేళ్ల క్రితం తన తండ్రిని అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన విషయం విదితమే.