హరిత తెలంగాణగా రూపుదిద్దుదాం | haritha telangana | Sakshi
Sakshi News home page

హరిత తెలంగాణగా రూపుదిద్దుదాం

Aug 10 2016 6:33 PM | Updated on Sep 4 2017 8:43 AM

ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

  •  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 
  • నాగర్‌కర్నూల్‌: ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నల్లవాగు నుంచి ఉయ్యాలవాడ వరకు బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
     
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావితరాలను దృష్టిలో ఉంచకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లే తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినపుడే మన బాధ్యతను నెరవేర్చినట్టని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ డీఈడీ కళాశాల, కస్తూర్భా విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, ఉయ్యాలవాడ సర్పంచ్‌ మనోహరమ్మ, ఎంపీటీసీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement