హామీల అమలులో విఫలం | governament failur in pramises | Sakshi
Sakshi News home page

హామీల అమలులో విఫలం

Aug 3 2016 9:39 PM | Updated on Aug 14 2018 2:34 PM

ఎన్నికల హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
  • బెజ్జంకి : ఎన్నికల హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అధికారంలో వస్తే స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి దేశానికి తీసుకొస్తానని, రెండు కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీలిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు వాటిని విస్మరించారని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలంటూ ఎనెన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీనపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర హామీలు అమలుకావడం లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రుణమాఫీ అమల్లో రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ సీపీఐని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గన్నేరువరానికి చెందిన సీనియర్‌ నాయకుడు బుర్ర అంజయ్యగౌడ్‌ తిరిగి పార్టీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాంగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కొనగంటి కేదారి, మండల కార్యదర్శి పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి బోనగిరి రూపేష్, ఏఐవైఎష్‌ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లేశం, ఏఐఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంగెం మధు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement