'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం' | full water with projects in telangana state, says harish rao | Sakshi
Sakshi News home page

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

Sep 24 2016 10:58 AM | Updated on Sep 4 2017 2:48 PM

భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్ట్లన్నీ జలకళను సంతరించుకున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు.

మెదక్ : భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్ట్లన్నీ జలకళను సంతరించుకున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. శనివారం మెదక్లో హరీశ్రావు మాట్లాడుతూ... పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. సింగూరు ప్రాజెక్ట్లో ఇన్ఫో పెరగిందన్నారు. అందువల్లే నీటిని దిగువకు వదిలామని చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల నీటి కొరత తీరందని హరీశ్రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement