వికారాబాద్‌లో ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు | Five injured in road accident | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు

Jul 26 2016 6:44 PM | Updated on Aug 30 2018 4:07 PM

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్ వద్ద ఓ ఆటో బోల్తాపడింది.

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్ వద్ద ఓ ఆటో బోల్తాపడింది. వివరాలు..మారుతీ నగర్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆపమన్నా ఆపకుండా వెళ్లిపోతుండటంతో కానిస్టేబుల్ వెంబడించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను బయటకు లాగడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ బాలుడికి కాళ్లూ చేతులూ విరిగాయి. దీంతో బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన మరో నలుగురికి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement