అట్రాసిటీ కేసులపై విచారణ | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులపై విచారణ

Published Wed, Jul 27 2016 11:24 PM

enquiry on atracicity cases

తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్‌ విచారణ చేపట్టారు. అండగుండాల గ్రామ దళితులకు సంబంధించిన స్మశాన స్థలాన్ని చేనిగుంటకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు అయింది. ఈ కేసుతో పాటు తడకు చెందిన ఓ గిరిజన యువతిని తిరుపతికి చెందిన వ్యక్తి మోసం చేశాడనే ఫిర్యాదుపైనా విచారణ జరిపారు. అండగుండాలలో పొలాన్ని పరిశీలించిన అనంతరం తడలోని పున్నమి అతిథిగహంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు.  

Advertisement
Advertisement