హైకోర్టును ఆశ్రయించిన సీపీఎం | divis case high court cpm | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన సీపీఎం

Sep 28 2016 11:13 PM | Updated on Sep 28 2018 4:30 PM

కాకినాడ సిటీ : దివీస్‌ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివీస్‌ బాధిత గ్రామాల్లో ఒకటైన పంపాదిపేటలో ఈ నెల 6వ తేదీన వామ

కాకినాడ సిటీ : దివీస్‌ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివీస్‌ బాధిత గ్రామాల్లో ఒకటైన పంపాదిపేటలో ఈ నెల 6వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు సభ జరగకుండా అడ్డుకున్నారన్నారు. సెప్టెంబర్‌ 10l, 13, 22 తేదీల్లో ఏదో ఒకరోజు బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని పెద్దాపురం సబ్‌ డివిజన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ను కోరామని, ఈ మూడు సందర్భాలలోను 144  సెక్షన్‌ అమలులో ఉన్నందున తాము బహిరంగసభకు అనుమతి ఇవ్వడంలేదని డీఎస్‌పీ తెలిపారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement