ఇంద్రకీలాద్రిపై భక్తుల అవస్థలు | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై భక్తుల అవస్థలు

Published Sun, Oct 16 2016 1:57 PM

devotees problems on Indrakiladri

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కావడంతో పాటు దుర్గమ్మ స్వర్ణ కవచ ధారిణిగా దర్శనమిస్తుండటంతో.. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో కిటికిట లాడుతున్న క్యూలైన్లకు పైకప్పులు ఏర్పాటు చేయకపోవడంతో.. ఎండ తీవ్రతకు పలువురు వృద్ధులు స్పృహ తప్పిపడిపోతున్నారు. . భక్తుల కోసం సరైన తాగునీటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement