ఒంటె వాహనంపై నెట్టికంటుడు | Camel vehicle nettikantudu | Sakshi
Sakshi News home page

ఒంటె వాహనంపై నెట్టికంటుడు

Aug 9 2016 11:15 PM | Updated on Sep 4 2017 8:34 AM

ఒంటె వాహనంపై నెట్టికంటుడు

ఒంటె వాహనంపై నెట్టికంటుడు

శ్రావణమాస తొలి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

గుంతకల్లు రూరల్‌ : శ్రావణమాస తొలి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు  ఉత్సవ మూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రధానఅర్చకుడు వసుధరాజాచార్యులు, వేద పండితులు అనంతపద్మనాభశర్మ, రామకృష్ణావధానిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ టెంకాయ సమర్పించి ఊరేగింపు ప్రారంభించారు. వేలాదిమంది భక్తుల ఆంజనేయ నామస్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement