హోదాపై ప్రజలకు వంచించిన బీజేపీ, టీడీపీ
ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ, టీడీపీ నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచించాయని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ చేసిన మోసం, దగా, కుట్రలకు ప్రజాబ్యాలెట్ సమాధానం చెబుతుందన్నారు.
-
ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ కె.రామకృష్ణ
-
ప్రజాబ్యాలెట్ నిర్వహించిన హోదా సాధన సమితి
విజయవాడ (గాంధీనగర్) : ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ, టీడీపీ నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచించాయని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ చేసిన మోసం, దగా, కుట్రలకు ప్రజాబ్యాలెట్ సమాధానం చెబుతుందన్నారు. విజయవాడ లెనిన్సెంటర్లో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ మంగళవారం ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నెలాఖరువరకు సాగుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్, పోలవరం , రాజధాని నిర్మాణం తదితర అంశాలపై అప్పటి ప్రధాని మన్మోçßæన్సింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలను ప్రచారం చేసుకుని బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసి ఇప్పుడు హోదా లేదంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హోదా కాకుండా ప్యాకేజీ ప్రకటించి సిగ్గులేకుండా వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దోనేపూడి శంకర్, ఉపాధ్యక్షులు శర్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పల్లా సూర్యారావు, లంకా దుర్గారావు, సీహెచ్ శ్రీనివాస్, నూతక్కి సీతారామయ్య, మహిళా సమాఖ్యసభ్యులు ఓర్సు భారతి, దుర్గాసి రమణమ్మ, పంచదార్ల దుర్గాంబ పాల్గొన్నారు.