మాణిక్‌ప్రభు ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు | ACB raids in irrigation dy ee in nalgonda | Sakshi
Sakshi News home page

మాణిక్‌ప్రభు ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు

Mar 11 2016 11:29 AM | Updated on Aug 17 2018 12:56 PM

నల్గొండ జిల్లా గుర్రంపాడు డివిజన్ ఇరిగేషన్ డీఈ మాణిక్ ప్రభు నివాసంపై ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు.

హైదరాబాద్ : నల్గొండ జిల్లా గుర్రంపాడు డివిజన్ ఇరిగేషన్ డీఈ మాణిక్ ప్రభు నివాసంపై ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న మాణిక్ ప్రభు నివాసంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన సైదాబాద్ తన ఇంటి సమీపంలో ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. 1.37 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.

అతడిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు. తిరిగి మాణిక్ ప్రభు గురువారం బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అతడి నివాసంపై మరోసారి దాడి చేశారు. హయత్నగర్, ఉప్పల్లో ప్లాట్లు, మూడు బ్యాంకుల్లో రూ. 73 లక్షలతోపాటు ఇంట్లో మరో రూ. 3 లక్షల నగదుతోపాటు 700 గ్రాముల బంగారం, కారు రెండు మోటారు సైకిళ్లు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement