మహిళ దారుణ హత్య

Woman Molestation and murdered in Karnataka - Sakshi

అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానం  

కర్ణాటక, బొమ్మనహళ్లి: ఓ మహిళ దారుణ హత్య కు గురైన ఘటన నగరం లోని ఆనేతాలుకా లో ని సూర్యసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో ఉన్న కిత్తగానహళ్లిలో గురువారం వెలుగు చూసింది. హతురాలు సునతిదాస్‌ (35)గా గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్‌ ప్రాంతానికి చెందిన సునతి దాస్‌ రెండేళ్ల క్రితం బెంగళూరు కిత్తగానహళ్లిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇళ్లల్లో వంట పనులు చేసే సునతిదాస్‌ను మూడు నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్య క్తులు వచ్చి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సునతి ఇంటి తలుపులు బద్దలు కొట్టిచూడగా ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. హ త్యకు ముందు అత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.కేసుదర్యాప్తులో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top