ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

Train Hits School Bus in UP Kushinagar - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు.  కుశినగర్‌ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, ఈ నెలలో ఇది రెండో ఘటన. ఏప్రిల్‌ 10వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ కంగారాలో ఓ స్కూల్‌ బస్సు లోయలో పడి 27 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top