చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం | Old Man Molestation On Girl In West Godavari | Sakshi
Sakshi News home page

చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

Jul 11 2018 6:28 AM | Updated on Jul 23 2018 8:51 PM

Old Man Molestation On Girl In West Godavari - Sakshi

బూరాడ రాంబాబు (ఫైల్‌) నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న దెందులూరు ఏఎస్‌ఐ పి కుమారస్వామి

దెందులూరు: అభం, శుభం తెలియని చిన్నారి అందులోను మూగ చిన్నారి కావటంతో కామాంధుడు కన్నూ, మిన్నూ కానకుండా అత్యాచారం  చేశాడు. ఈ అత్యంత దారుణమైన సంఘటన దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకోవటంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన మూగ చిన్నారి తల్లిదండ్రులు గోపన్నపాలెం బ్యాంకుకు వెళ్లారు. ఈ విషయాన్ని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న బూరాడా రాంబాబు పసిగట్టాడు.

మూగ చిన్నారిని సమీపంలోని పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి ఏడుస్తూ ఉండటంతో పక్కింటి వారు ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని వారికి సైగల ద్వారా చెప్పింది. దీంతో గ్రామస్తులు కామాంధుడిని చితకబాదారు. చిన్నారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురించి డీజీపీకి ఫిర్యాదు చేయడంతో దెందులూరు ఏఎస్‌ఐ పి.కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని శిక్షించాలని గ్రామస్తుల ధర్నా
నాలుగేళ్ల మూగబాలికపై కన్నూ, మిన్నూ కానకుండా అత్యాచారం చేసిన కామాంధుడు రాంబాబును గతంలో యాసిడ్‌ దాడి చేసిన వారిని శిక్షించిన మాదిరిగానే పోలీసులు శిక్షించాలని మహిళా సంఘాలు, సోమవరప్పాడు గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. కామాంధుడి విషయంలో సరైన శిక్ష అమలు చేసి బాధిత చిన్నారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement