ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం | Man Died in Car Accident Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

Jan 28 2019 8:26 AM | Updated on Jan 28 2019 8:26 AM

Man Died in Car Accident Odisha - Sakshi

ఘటనా స్థలం వద్ద నుజ్జయిన కారు

శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణంలో 25 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో స్థిరపడిన దుంపల ధర్మారావు(52) ఆదివారం మృతిచెం దారు. మెళియాపుట్టి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్న ఆయన... సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశానికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని రాణిపేట వచ్చేసరికి ఆటోపై కారు దూసుకు రావడంతో అక్కడిక్కడే మృతిచెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధర్మారావు పలాసలో నివాసం ఉన్నప్పటికీ స్వగ్రామం పలాస మండలం లక్ష్మీపురం. ఆయన భార్య గీతావాణి మెళియాపుట్టి కేజీబీవీలో అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పలాస–కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు దుంపల మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement