ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | man Commits Suicide In PSR nellore | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Nov 2 2018 12:59 PM | Updated on Nov 2 2018 12:59 PM

man Commits Suicide In PSR nellore - Sakshi

ఉరేసుకుని మృతి చెందిన కరేటి సురేంద్ర

నెల్లూరు,సంగం: ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చిన భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరగడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన సంగం–కావలి కాలువ సమీపంలో గురువారం తెల్ల వారుజామున జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన కరేటి సురేంద్ర(38) స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 15 ఏళ్ల క్రితం వింజ మూరు మండలం గుండెమడగల గ్రామానికి చెందిన శివరావమ్మతో వివాహం అయింది. వీరికి గోవర్ధన్, లాస్యప్రియ పిల్లలు ఉన్నారు. సురేంద్ర అన్ని రకాల వ్యాపారాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇటీవల ఓ ఆటో కొనుక్కుని బతుకుబండిని లాగిస్తున్నాడు.

అయితే ఐదు రోజుల క్రితం సురేంద్ర అత్తగారి ఊరు గుండెమడగలకు భార్య, పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఉన్న సురేంద్ర బుధవారం రాత్రి ఏదో విషయంలో భార్యతో చిన్న గొడవ పడ్డాడు. మనస్థాపానికి గురైన తాను గొలగమూడికి వెళ్లి చనిపోతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. గురువారం తెల్లవారు జామున కావలి కాలువ సమీ పంలో డాబా వెనుక వైపునున్న నేరుడు చెట్టుకు ఉరేసుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుమున బహిర్భూమికి వెళ్లిన స్థానికులు గమనించి ఎస్సై నాగార్జునరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటనా స్థలా న్ని పరిశీలించి, మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం చేసి బ«ంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement