రోడ్డు ప్రమాదంలో అక్కా,తమ్ముడు మృతి | 2 died in road accident at east godavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అక్కా,తమ్ముడు మృతి

Jan 18 2018 10:49 AM | Updated on Aug 30 2018 4:17 PM

తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని రాజానగరం మండలం దివాన్‌ చెరువు వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న అక్కా, తమ్ముడు సంఘటనా స్థలిలోనే మరణించారు.

ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement