అన్ లిస్టెడ్ పీఎస్యూలు ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలి: కేంద్రం | Unlisted PSUs should be given special dividend: center | Sakshi
Sakshi News home page

అన్ లిస్టెడ్ పీఎస్యూలు ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలి: కేంద్రం

Mar 5 2016 12:35 AM | Updated on Sep 3 2017 7:00 PM

భారీగా నగదు నిల్వలున్న ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ సంస్థలు..

న్యూఢిల్లీ: భారీగా నగదు నిల్వలున్న ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ సంస్థలు.. ఇకపై కేంద్రానికి ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించాల్సి రానుంది. లేదా ప్రభుత్వ షేర్లను బైబ్యాక్ అయినా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతటినీ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కింద కొత్తగా పేరు మారిన డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం పర్యవేక్షించనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. పుష్కలంగా నిధులు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) .. విస్తరణ ప్రణాళికలేమీ లేకపోతే ఆ నిధులను డివిడెండుగా చెల్లించేందుకో లేదా ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేయడానికో వెచ్చించాలని దాస్ సూచించారు. మార్కెట్ విలువను రాబట్టేలా లిస్టింగ్‌కు అర్హమైన పీఎస్‌యూలను ఎంపిక చేసే బాధ్యతను దీపంనకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement