ఆధార్‌పై బ్యాంకులకు అదనపు గడువు | UIDAI relaxes Aadhaar enrolment targets for banks | Sakshi
Sakshi News home page

ఆధార్‌పై బ్యాంకులకు అదనపు గడువు

Sep 1 2018 2:25 AM | Updated on Sep 1 2018 2:25 AM

UIDAI relaxes Aadhaar enrolment targets for banks - Sakshi

న్యూఢిల్లీ: ఖాతాదారుల ఆధార్‌ నమోదు విషయంలో బ్యాంకులకు వెసులుబాటు లభించింది. గడువును నవంబర్‌ 1 వరకు పొడిగిస్తూ యూఐడీఏఐ బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రతి శాఖలో జూలై 1 నుంచి ప్రతి రోజు కనీసం ఎనిమిది ఆధార్‌ నమోదులు లేదా అప్‌డేషన్‌ చేసేలా చూడాలని బ్యాంకులను యూఐడీఏఐ ఈ ఏడాది జూన్‌లో కోరింది. అక్టోబర్‌ నుంచి ప్రతీ రోజూ 12 నమోదులు, 2019 జనవరి నుంచి రోజూ 16కు తీసుకెళ్లాలని ఆదేశించింది.

నిబంధనలను పాటించకపోతే ఆర్థిక పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాలను సవరిస్తూ తాజాగా యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నవంబర్‌ నుంచి నిత్యం 8తో ప్రారంభించి, జనవరిలో 12కు, ఏప్రిల్‌ నుంచి 16కు పెంచాలని కోరింది. ఈ లక్ష్యాలను బ్యాంకులు చేరుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కేరళ, పలు ఇతర రాష్ట్రాల్లో విపత్తుల కారణంగా గడువును, లక్ష్యాలను సడలించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement