► సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు
► కలసివచ్చిన షార్ట్ కవరింగ్
► 122 పాయింట్ల లాభంతో 29,531కు సెన్సెక్స్
► 43 పాయింట్ల లాభంతో 9,144కు నిఫ్టీ
సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. నేడు(గురువారం) మార్చి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో స్టాక్ సూచీలు ఎగిశాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 29,531 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 9,144 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది వారం గరిష్ట స్థాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా షేర్లు నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి
లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...
అమెరికా వినియోగదారుల విశ్వాస గణాంకాలు పటిష్టంగా ఉండడం, ముడి చమురు ధరలు పెరగడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఈ జోష్తో బుధవారం ఆసియా మార్కెట్లు(చైనా మినహా) లాభాల్లో ఉండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉండడం, రూపాయి 17 నెలల గరిష్ట స్థాయికి బలపడడం, జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టడం..., ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.6,415 కోట్లు నికర కొనుగోళ్లు జరపడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
వాహన షేర్లు స్కిడ్..
మొండి బకాయిల సమస్య పరిష్కారంపై కసరత్తు చేస్తున్నామని, దీనికి సంబంధించి ఈ వారంలోనే ఆర్థిక మంత్రి, ఆర్బీఐ అధికారులు, బ్యాంక్ అధినేతలతో సమావేశం అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో బ్యాంక్ షేర్ల లాభాల పరుగు బుధవారం కూడా కొనసాగింది. ఎస్బీఐ 2 శాతం లాభపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 శాతం చొప్పున పెరిగాయి. భారత్ స్టేజ్–త్రి వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలను వచ్చేనెల 1 నుంచి సుప్రీం కోర్ట్ నిషేధించడంతో వాహన షేర్లు కుదేలయ్యాయి. హీరో మోటొకార్ప్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ షేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి.30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో, 14 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 1.8 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.2 శాతం, కోల్ ఇండియా 1 శాతం, హెచ్డీఎఫ్సీ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈలో 1,669 షేర్లు నష్టపోగా, 1,182 షేర్లు లాభపడ్డాయి.
లాభాల్లో బ్యాంక్ షేర్లు
Published Thu, Mar 30 2017 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement